Thursday, April 25, 2024

గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో విషాదం… కరోనాతో పోరాడి యువ వైద్యుడి మృతి…

వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని బలికొన్న మహమ్మారి….
గుంటూరు మెడికల్ – గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో పోరాడి ఓ యువ వైద్యుడు మృతి చెందిన సంఘటన సోమవారం ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ ఆది శేషుబాబు కరోనా బారిన పడి మృతి చెందారు. గత వారం రోజులుగా అలుపెరగకుండా రోగులకు చికిత్స అందిస్తూ ఆదివారం ఆయన మహమ్మారి బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోని గుండె వైద్య విభాగం తరలించే లోపే ఆయన మృతి చెందారు. ఇప్పటికే కరోనా బారిన పడి ఆసుపత్రిలో వైద్య విభాగానికి చెందిన ఓ వైద్యుడు మూడు రోజుల క్రితం మృతి చెందగా 2 రోజుల క్రితం తొమ్మిది నెలల గర్భిణి గా ఉన్న స్టాఫ్ నర్స్ రజిని మృత్యువాత పడిన విషయం విదితమే. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఆప్తులను కోల్పోయిన ఆస్పత్రి వైద్యులు సిబ్బంది విషాద వదనాలతో మునిగిపోయారు

Advertisement

తాజా వార్తలు

Advertisement