Thursday, April 25, 2024

పవర్ లిఫ్టింగ్ లో విద్యార్థినికి బంగారు పతకం : స‌త్క‌రించిన మాజీ మంత్రి

తెనాలి : ఈనెల 20నుండి 22 వరకు అనకాపల్లిలో జై దుర్గ, జై జై దుర్గ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెనాలి ఎన్నారై విద్యార్థిని ఫేక్ షబీనా బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విద్యార్థినిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రా ప్యారీస్ అంటేనే పతకాల పంట అని, విద్యార్థిని రాష్ట్ర, జాతీయ స్థాయిలోమరిన్ని పథకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఐ సీఈవో ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపల్ శివ నారాయణ, కృష్ణారెడ్డి, సురేష్, తల్లిదండ్రులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement