Thursday, April 18, 2024

తీసుకున్న అప్పు అడిగినందుకు.. వాలంటీర్ దారుణ హత్య

తెనాలి : తీసుకున్న అప్పును ఇవ్వాలని అడిగినందుకు మైనర్ బాలుడు అతని తండ్రితో కలిసి వాలంటీర్ పై దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి ఆర్ ఆర్ నగర్ లో జరిగింది. త్రీ టౌన్ పోలీసుల కథనం మేరకు…. పట్టణంలోని 24వ వార్డ్ వాలంటీర్ గా సందీప్ (22) పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలుడు వాలంటీర్ వద్ద రూ.2000 అప్పుగా తీసుకున్నాడు. అప్పును చెల్లించాలంటూ సందీప్ అడగడంతో మైనర్ బాలుడు తన తండ్రి వెంకటేశ్వర్లుతో కలిసి వాలంటీర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సందీప్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సందీప్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మైనర్ తో పాటు తండ్రి వెంకటేశ్వర్లును కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement