Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

బాపట్ల – రోడ్డు ప్రమాదంలో ఒక‌ విద్యార్థిని మృతి చెందగా,మరో విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యారు.రూరాల్ యస్ఐ కిరణ్ కథనం మేరకు బాపట్ల పట్టణం కు చెందిన మేరీ గ్రెస్ జులియ(20),కర్నూల్ జిల్లా డోన్ కు చెందిన సమిన లు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ మూడోవ సంవత్సరం చదువుతున్నారు. ఈ ఇద్ద‌రు భోజన విరామ సమయంలో ఔట్ గేట్ వద్ద రోడ్డు పైకి రాగ మోటార్ సైకిల్ తో ఢీకొంది. మేరీ గ్రేస్ జులియ,సమీన లకు తీవ్ర గాయాలు కాగా,మేరీ గ్రెస్ జులియ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు తరలించారు.ఆమె అక్క‌డ‌ చికిత్స పొందుతూ మృతి చెందింది.సమిన ఆరోగ్యం కుదిటపడినట్లు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి బాబూరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement