Saturday, April 20, 2024

చిన్న రైతుల‌కు డ్రిప్ ఇరిగేష‌న్ – జ‌గ‌న్

అమరావతి, : నిర్ణీత కాలంలోగా చిన్న, సన్నకారు రైతులు అందరికీ డ్రిప్‌, స్పింక్లర్‌ సదుపాయాలను కల్పిం చడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల యంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు (హార్టికల్చర్‌, మైక్రో ఇరిగేషన్‌, అగ్రి ఇన్‌ఫ్రా) పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీనివల్ల చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్‌, స్పింక్లర్‌ సదుపాయాలను పూరి ్తస్థాయిలో కల్పించినట్టు- అవుతుందని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు ఎలాగూ బోర్లు వేయిస్తున్నాం కాబట్టి, వారికి సూక్ష్మసేద్యం సదుపాయాలను ఇచ్చిన-్లటెతే మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఏంచేసినా శాచ్యురేషన్‌ పద్ధతిలో ఉండాలన్నది గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదని, అందరికీ అందాలన్నది ప్రభుత్వ సంకల్పమని స్పష్టంచేశారు. ఈక్రమంలోనే వ్యవస్ధలో అవినీతి ఉండకూడదని, చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న దానిపై ఒక కార్యాచరణ ఉండాలని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్‌, స్పింక్లర్‌ సదుపాయాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయిలో ఆలోచనలు చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. సూక్ష్మసేద్యం సదుపాయాలను రివర్స్‌-టె-ండరింగ్‌ ద్వారా కొనుగోలు చేయడం చేస్తే రేటు- తగ్గుతుందని, దీనివల్ల ఎక్కువ మంది రైతులకు అందుబాటు-లోకి తీసుకువచ్చే అవకాశం ఉంటు-ందని తెలిపారు.అలాగే సెరికల్చర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం మల్బరీని సాగుచేస్తున్న రెతులకు ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టడం ద్వారా వారి పరిస్థితులను పూర్తిస్థాయిలో మెరు గుపరచాలని సూచించారు.
మల్టి పర్పస్‌ కేంద్రాల్లో 14 రకాల సేవలు
అగ్రి ఇన్‌ఫ్రాలో భాగంగా ఏర్పాటు- చేయనున్న మల్టీపర్సస్‌ ఫెసిలిటీ- సెంటర్లలో దాదాపు 14 రకాల సదుపాయాలు అందు బాటులోకి వస్తాయని తెలిపారు. డ్రై స్టోరేజీ, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, ఇ-మార్కెటింగ్‌, జనతాబజార్లు, ప్రైమరీ ప్రాససింగ్‌ యూనిట్లు- తదితర సదుపాయాలు ఉంటాయని తెలిపారు. వీటికోసం దాదాపు రూ.14,562 కోట్లు- ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్దతులను ప్రమోట్‌ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛెర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవ సాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్‌, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యు మ్న, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై మధుసూదనరెడ్డి, హార్టికల్చర్‌ కమి షనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement