Wednesday, March 27, 2024

హైకోర్టులో దేవినేనికి ఊర‌ట‌..

అమరావతి: త‌ప్పుడు వీడియో పోస్ట్ చేసిన విష‌యంలో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఎపి సిఐడి ఇచ్చిన నోటీస్ పై టిడిపి నేత దేవినేని ఉమ‌కు ఊర‌ట ల‌భించింది… ఈ నోటీస్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఆయ‌న హైకోర్టులో వేసిన క్యాష్ పిటిష‌న్ పై నేడు విచార‌ణ జ‌రిగింది.. అనంత‌రం తాత్కాలిక‌ తీర్పు వెలువ‌రించిన హైకోర్టు దేవినేని ఉమకు 41ఏ కింద రక్షణ కల్పించాల‌ని సిఐడి అధికారుల‌ను కోరింది.. అదే స‌మ‌యంలో మే 7 తేదీ వరకు దేవినేనిపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దని కోర్టు సూచించింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు మంగళగిరి సీఐడీ ఆఫీసులో విచారణకు దేవినేని ఉమ హాజరుకావాలని ఆదేశించింది.. ఈ కేసు విచార‌ణ‌ను మే 7వ తేదీకి కే వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement