Saturday, April 20, 2024

తుఫాను బాధితులను ఆదుకోవాలి : అచ్చెన్నాయుడు

మాండూస్ తుపాను కార‌ణంగా రాష్ట్రంలోని ప‌లు జిల్లాల రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని, వారిని ఏపీ ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. ఎంతో ప్ర‌జ‌లు ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నార‌ని వారికి కూడా ప్ర‌భుత్వం అండ‌గా ఉండాల‌న్నారు. తుపాను కార‌ణంగా రైతులు పంట‌లు భారీ డ్యామేజ్ కి గుర‌య్యాయ‌ని, వాటిని ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌న్నారు. రైతు ప‌క్ష‌పాతి అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ రైతుల సంక్షేమాన్ని పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేశారని విమర్శించారు. పాడైపోయిన పంటుకు కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన మద్దతు ధర అందించాల‌న్నారు. ప్ర‌భుత్వం వెంట‌నే నష్టపోయిన పంట నష్టాన్ని అంచనా చేపట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement