Thursday, April 25, 2024

భ‌ట్టిప్రోలులో క‌రోనా క‌ల్లోలం – అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ

భట్టిప్రోలు మండల వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న‌ది.. శనివారం 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు ఏ సీతాకుమారి, సిహెచ్ రామలక్ష్మి లు తెలిపారు. భట్టిప్రోలు లో 13, అద్దేపల్లి, సూరేపల్లి లలో 2 చొప్పున, కోనేటిపురం, పల్లెకోన లలో ఒక్కొక్కటి చొప్పున వెల్లటూరు పీహెచ్ సీ పరిధిలో పెదపాలెం, వెల్లటూరు లలో ఒక్కొక్కటి చొప్పున కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు భట్టిప్రోలు పీహెచ్ సీ పరిధిలో 78, వెల్లటూరు పీహెచ్ సీ పరిధిలో 59 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెరసి మొత్తం భట్టిప్రోలు మండలం లో 118 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఆయా గ్రామాల్లో స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు.భట్టిప్రోలు, వెల్లటూరు లలో ఉదయం 11 గంటల తరువాత కర్ఫ్యూ వాతావరణం తలపిస్తుంది.కావున ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ , భౌతిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్క్ ధరించి, తరచూ శానిటైజర్ ఉపయోగిస్తూ అత్యవసరమైతేనే బయటకు రావాలని, వీలైనంత వరకు ఎక్కువగా ఇళ్ళ లోనే గడపాలని వైద్యాధికారులు , రెవెన్యూ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement