Sunday, April 14, 2024

పేద మహిళలంటే చంద్రబాబుకు చులకన : వాసిరెడ్డి పద్మ

గుంటూరు : టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబుపై ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప్స‌న్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతి బాధాకరం అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ ఘటనకు కారణమన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోనే కానుకల సభ జరిగిందన్నారు. పేద మ‌హిళ‌లంటే చంద్రబాబుకు చులకన అని, చంద్రన్న కానుకల పేరిట ఆశ చూపించారన్నారు. ఘటనపై మహిళా కమిషన్‌ నివేదిక కోరిందన్నారు. అంత‌కుముందు వాసిరెడ్డి ప‌ద్మ గాయ‌ప‌డిన మ‌హిళ‌ల‌ను గుంటూరు ఆస్ప‌త్రికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement