Saturday, April 20, 2024

క‌రోనా క‌ష్టాలు తీరాలి‌‌ – చంద్రబాబు

అమ‌రావ‌తి -ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారం దరికీ, తెలుగు రాష్ట్రాల ప్రజల కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సోమ వారం వేర్వేరు ప్రకటనల్లో చైత్ర శుక్ల పాడ్యమినాడే ఈ సృష్టి ఆరంభమైందని ఆ రోజునే మనం ఉగాదిగా పాటిస్తున్నామని, మన తెలుగువారికి ఉగాదే నూతన సంవత్సరమని పేర్కొన్నారు. ఈ సంవత్సర మంతా ప్రజలందరికీ కరోనా రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఉగాది పర్వ దినం చాలా మంచి రోజని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆయురాగ్యాలతో సురక్షితంగా ఉండాలని ప్రార్ధిస్తున్నామని పేర్కొన్నారు. నూతన సంవత్స రం మీ ఆశయాలు నెరవేరాలని, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటు-న్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement