Thursday, April 25, 2024

ప్ర‌తి ఇంటా ప్ల‌వ శోభ – గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఉగాది ఆకాంక్ష

అమరావతి, : సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో ‘శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది’ శాంతి, సామరస్యం, ఆనందాన్ని నింపా లని కోరుకుంటు-న్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని రాజ్‌ భవన్‌ విడుదల చేసిన ప్రకటనలో ఈ సంతోషకర మైన పండుగ శుభవేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలతో పాటు- ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సాధారణం గా నూతన సంవత్సరం ప్రజలకు తమ ఉజ్వల భవిష్యత్తుపై కొత్త ఆశలను చిగురింప చేస్తుందని, ఈ క్రమంలో ప్రతి ఇంటా శుభం కలగాలని తాను కోరుకుంటు-న్నానని ఆయన పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్దితులలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి వారి కుటు-ంబ సభ్యులతో ఉగాది పండుగను జరుపు కోవాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరాన్ని పాటించటం, మాస్కు ను తప్పని సరిగా ధరించడం, శాని-టైజర్ను ఉపయోగిస్తూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం ద్వారా కరోనా నుండి విముక్తి పొందుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement