Thursday, April 18, 2024

రాజధాని రైతులకు శుభవార్త.. కౌలు నిధులు విడుదల చేసిన ఏపీ సర్కారు

రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు 2021-22 ఏడాదికి రూ.195 కోట్ల వార్షిక కౌలు నిధులను ఏపీ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్ పథకం కింద గతంలో ప్రభుత్వానికి భూములు అప్పగించిన వారికి ఈ వార్షిక కౌలు వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.

కాగా ఈ ఏడాది కౌలు కోసం మందడం రైతులు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం కౌలు నిధులు విడుదల చేసింది. గతంలో రైతులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ తర్వాతే సర్కారు నిధులు విడుదల చేసింది. ఈసారి విచారణకు ముందుగానే కౌలు నిధులు ఇచ్చినట్టయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement