Friday, March 15, 2024

ఎపిలో రేప‌టి నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి అత్య‌వ‌స‌రం మిన‌హా స‌ర్వం బంద్…..

ఒక్కపూటే షాపులకు అనుమతి
ఆ సమయంలో 144 సెక్షన్‌
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు
ఆ తర్వాత అన్నీ బంద్‌
అత్యవసర సేవలకు మినహాయింపు
రెండు వారాల పాటు ఆంక్షలు
ఆటోలు, బస్సులకు మినహాయింపు లేదు
కోవిడ్‌ నియంత్రణ కోసం కీలక నిర్ణయం: సీఎం జగన్‌

అమరావతి : రాష్ట్రంలో కోవిడ్‌ను సమర్ధవంతంగా నియంత్రించేందుకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ, ఆంక్షలు విధించా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాల యంలో కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఒక వైపు ప్రజల దైనందిన అవసరాలు తీరడంతో పాటు, మరోవైపు వ్యాపారులు, అన్ని వర్గాలకు ఇబ్బంది కలగకుండా పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 5వ తేదీ బుధవారం నుండి రెండు వారాలపాటు ఈపాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ, ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఎటువంటి వ్యాపారాలు నిర్వహించేందుకు వీలు లేదు. కాగా, అంబులెన్సులు, ఆక్సిజన్‌ రవాణా వాహ నాలు వంటి అత్యవసర సేవలకు సంబంధించిన వాటికి మా త్రమే 24/7 అనుమతి ఉంటుంది. అయితే, ఉదయం 6 గం టల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులు తెరి చిన సమయంలో 144 సెక్షన్‌ అమలు చేస్తారు. 5గురికి మించి ఒకే చోట చేరకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆటోలు, బస్సులకూ మినహాయింపు లేదు
కర్ఫ్యూ సమయంలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజా రవాణాను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను నిలువరించనున్నారు. పదేపదే ఆటోలు రోడ్లపైకి వస్తే సీజ్‌ చేసేందుకు కూడా వెనకాడ కూడ దని నిర్ణయించారు.ఈమేరకు సంబంధిత అధికారు లకు ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు- సిటీ- బస్సుల రాకపో కలను నియంత్రించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత సమయాలకు మించి రాకపోకల్ని నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పరీక్షలు-వైద్య సేవలు
కోవిడ్‌ పాజిటివ్‌గా గుర్తించిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని, ఇది పక్కాగా జరగాలని సమీక్షలో సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఎంప్యానెల్‌లో (జాబితా)లో ఉన్న ఆస్పత్రుల్లో కూ డా వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరారు.
ఆక్సిజన్‌ సరఫరా
అన్ని ఆస్పత్రులలో రోగులకు సరిపడా ఆక్సిజన్‌ను అందుబాటు-లో ఉంచే విధంగా దిగుమతి చేసుకోవాలని చెప్పారు. అదే విధంగా దిగుమతి చేసుకున్న ఆక్సిజన్‌ను నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు- చేయాలన్నారు. నిల్వచేసుకునే మేరకు ట్యాంకర్లు సేకరించాలని, ఏ ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
ఆస్పత్రులు-బెడ్లు
రాష్ట్రంలో నెలకు సగటు-న 3,10,915 పరీక్షల చొప్పున ఇప్పటి వరకు మొత్తం 1,66,0,2873 పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 558 కోవిడ్‌ ఆస్పత్రులు ఉండగా, వాటిలో మొత్తం 44,599 బెడ్లు ఉన్నాయని, ఆ ఆస్పత్రులలో 37,760 మంది కోవిడ్‌ చికిత్స పొందుతున్నారని తెలిపారు. 3,597 మంది రోగులు వెంటిలేటర్లపై చికిత్స పొందుతుండగా, 1,01,204 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని వివరించారు.
కోవిడ్‌ కేర్‌ సెంటర్లు
రాష్ట్ర వ్యాప్తంగా 81 కోవిడ్‌ కేర్‌ సెంటర్ల (సీసీసీ)లో 41,780 బెడ్లు ఉండగా, వాటిలో మే 2వ తేదీ వరకు 9,937 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఇంకా 31,843 బెడ్లు అందుబాటు-లో ఉన్నాయని చెప్పారు. 104 కాల్‌ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని వివరించారు.
ఆక్సిజన్‌
జిల్లాల్లో ఆక్సిజన్‌ వసతి ఉన్న ఆస్పత్రులు 146 ఉండగా, వాటిలో ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ ఉన్న బెడ్లు 26,446 ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు రోజుకు సగటు-న 420 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల మేర ఆక్సిజన్‌ వినియోగిస్తుండగా, ఈనెల రెండో వారం చివరి నాటికి ఆ వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు- తెలిపారు. రాష్ట్రాన్రికి 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించగా, రవాణాకు అవసరమైన ట్యాంకర్లు లేక అందులో 448 మెట్రిక్‌ టన్నులు మాత్రమే మనం తీసుకోగలుగుతున్నామని (ప్రభుత్వ, ప్రైవేటు- ఆస్పత్రులు కలిపి) చెప్పారు. ఆక్సిజన్‌ రవాణాతో పాటు-, స్టోరేజీకి కూడా ట్యాంకర్ల అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఆక్సిజన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోటా పెంచాలని కేంద్రాన్ని కోరామని అధికారులు వెల్లడించారు. పెరంబుదూరు (తమిళనాడు), బళ్లారి (కర్ణాట) నుంచి చెరి 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రవాణా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు- తెలిపారు. అదే విధంగా రవాణా కోసం వాహనాలు (ట్యాంకర్లు) ఇవ్వాలని కూడా కోరుతున్నామని చెప్పారు.
అందుబాటు- లోఔషథాలు
రాష్ట్రంలో కొత్తగా మైలాన్‌ ల్యాబ్‌ నుంచి 8 లక్షల రెడ్‌మిస్‌విర్‌ ఇంజెక్షన్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఇంకా ఎన్‌-95 మాస్కులు 5,67,844, పీపీఈలు 7,67,732, సర్జికల్‌ మాస్కులు 35,46,100, హోం ఐసొలేషన్‌ కిట్లు- 2,04,960 ఇప్పుడు నిల్వ ఉన్నాయని వారు చెప్పారు.
వాక్సినేషన్‌
రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇప్పటి వరకు 52 లక్షల మందికి తొలి వాక్సిన్‌ ఇవ్వడం జరిగిందన్న అధికారులు, మొత్తం 1,33,07,889 మందికి వాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement