Wednesday, April 24, 2024

ఎపిలో కరోనా కల్లోలం..4157 పాజిటివ్ స్ – 18 డెత్ స్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 4,157 కరోనా కేసులు నమోదుకాగా.. మహమ్మారికి చిక్కి నిన్న ఒక్కరోజే 18మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 9,37,049కి చేరగా.. మరణాల సంఖ్య 7,339కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24గంటల్లో 1,606 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 9,01,327 మంది ఆరోగ్యవంతులయ్యారు. మంగళవారం 35,732 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం కొవిడ్‌ సమాచారాన్ని విడుదుల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement