Friday, April 19, 2024

గుంటూరు జిల్లాలో విషాదం.. టీకా వికటించి చిన్నారి మృతి

గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో 18 నెలల పాపకు టీకా వేయించగా ఆ టీకా వికటించింది. దీంతో చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పాప మృతితో తల్లిదండ్రులు, బంధుమిత్రులు రోధిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: ఏపీ హోంమంత్రి ఇంటి వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

Advertisement

తాజా వార్తలు

Advertisement