Friday, April 26, 2024

ఎపి హెచ్ ఆర్ సి చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీతారామ మూర్తి పేరు ప్ర‌తిపాద‌న‌..

అమ‌రావ‌తి – రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మ‌న్ పోస్ట్ కి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామ మూర్తి పేరును ప్ర‌తిపాదించింది ప్ర‌భుత్వం.. ఈ ఎంపిక‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్, శాససనభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఇందులో స‌భ్యులుగా ఉన్న శాస‌నస‌భ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు, మండ‌లి విప‌క్ష నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు గైర్హాజ‌రయ్యారు.. ఈ స‌మావేశంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మ‌న్, సభ్యుల పేర్లను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రతిపాదించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామ మూర్తి, సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం(జ్యుడీషియల్‌), న్యాయవాది డాక్టర్‌ జి శ్రీనివాసరావు (నాన్‌ జ్యుడీషియల్‌)లను ప్రతిపాదించగా కమిటీ ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement