Saturday, April 20, 2024

Breaking: కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ఒక్కసారిగా చోరబడిన వేలాది ఉద్యోగులు

కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ముళ్ళ కంచె బారికేడ్లు తోసుకోని లోనికి చోరబడే యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే, ఒక్కసారిగా వేలాది మంది చోరబడ్డారు. దీంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు చేతులెత్తేశారు. మహిళా ఉద్యోగులు సైతం లోనికి చొరబాడ్డారు. పోలీసులు భారీ ఎత్తున మొహరించినా వారిని అడ్డుకోవడంతో విఫలమైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement