Saturday, April 20, 2024

క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న ఏపీ గ‌వ‌ర్న‌ర్

ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని రాష్ట్ర‌ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీసమేతంగా దర్శించుకున్నారు. గవర్నర్‌కు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్ మాట్లాడుతూ… దసరా మొదటి రోజు కనకదుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందకరమన్నారు. దుర్గే దుర్గతి నాశని… అంటూ అమ్మవారిని ప్రార్ధించానన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్న‌ట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement