Saturday, March 23, 2024

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

చిలకలూరిపేట: చిలకలూరిపేట మండల వేలూరు గ్రామ మండల ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ టీచర్‌గా పనిచేస్తున్నజి.వేణు (60) బుధవారం మధ్యాహ్నం మృతిచెందారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ సెంటర్లోని శంకర్‌విలాస్‌ హోటల్‌ వద్దసహోపాధ్యాయులతో కుర్చీల్లో ముచ్చటిస్తూనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఉపాధ్యాయులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు, సీపీఆర్‌ నిర్వహించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


సుగాలీకాలనీ నుంచి పురుషోత్తమపట్నం వెళ్లే మార్గంలో తండ్రి సన్నిధి చర్చి సమీపంలోని ఆయన స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. గతంలో.. యడ్లపాడు మండలంలోని జాలాది, జగ్గాపురం, తిమ్మాపురం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయ‌న విద్యావనరుల కేంద్రంలో ఎమ్మార్పీగా వ్యవహరిస్తూ వివాద రహితుడిగా ఉండేవాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు వేణు భౌతికకాయాన్ని సందర్శించి నివాళుల‌ర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఉపాధ్యాయుడికి భార్య శౌరీనా, ఇద్దరు కుమారులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement