Thursday, April 25, 2024

APPSC చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్‌ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది గౌతమ్‌ సవాంగ్‌కు అభినందనలు తెలిపారు. కాగా, డీజీపీగా ఉన్న సవాంగ్ ను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement