Saturday, April 20, 2024

ఏపీ పోలీసులు ఇన్నిరోజులు కళ్లు మూసుకున్నారా?: గోరంట్ల

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. చంద్రబాబుపై వైసీపీ నేతలు నీచమైన భాషను ఉపయోగించినప్పుడు డీజీపీకి వినిపించలేదా? అప్పుడు పోలీసులు కళ్లు మూసుకుని కూర్చున్నారా? అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు వాస్తవాలను చెపితే ఎందుకు భరించలేకపోతున్నారని నిలదీశారు. టీడీపీ నేతలు ఎంతో క్రమశిక్షణతో ఉంటారని, క్రమశిక్షణ తప్పితే వైసీపీ నేతలు బయట తిరగలేరని హెచ్చరించారు. ఒక చెంప మీద కొడితే… రెండు చెంపల మీద కొట్టే సత్తా టీడీపీకి ఉందని చెప్పారు. మా ఇంటికి దూరం ఎంతో మీ ఇంటికి దూరం అంతే అన్న సంగతి వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకుంటే మంచిదని గోరంట్ల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement