Thursday, April 25, 2024

Breaking: గుడిలో దొంగ‌త‌నానికి వెళ్లి.. గోడ క‌న్నంలో ఇరుక్కున్న దొంగ‌.. (వీడియో)

శ్రీకాకుళం జిల్లాలో విచిత్ర ఘ‌ట‌న జ‌రిగింది. చోరీ కోసం వెళ్లిన ఓ దొంగోడికి షాక్ త‌గిలింది. దొంగ‌త‌నానికి వెళ్ల‌గా ఓ గోడ క‌న్నంలో ఇరుక్కుపోయాడు. ఇది కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ దేవాలయంలో జ‌రిగింది. టెంపుల్‌లో దొంగతనం చేసేందుకు కంచిలికి చెందిన రీస్ పాపారావు దేవాలయంలోకి చొరబడ్డాడు. అయితే అమ్మవారి వస్తువులు దొంగిలించి తిరిగి బయటపడే క్రమంలో గోడకున్న‌ కన్నంలో ఇరుక్కు పోయాడు. దీంతో జాడుపూడి గ్రామస్తులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement