Wednesday, April 24, 2024

పోలీస్ చట్టానికి లోబడే జీవో నెంబర్ 1 : సజ్జల

పోలీస్ చట్టానికి లోబడే ప్రభుత్వం జీవో నెంబర్ 1ని తీసుకొచ్చిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై సభలను నిర్వహించడం సరికాదని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఈ జీవోను పట్టించుకోబోమని టీడీపీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారని… చట్టాన్ని ఉల్లంఘించడం సరికాదని అన్నారు. చంద్రబాబుకు కనీస మానవత్వం కూడా లేదని అన్నారు. చంద్రబాబు తీరును ప్రజలంతా గమనించాలని కోరారు. ప్రభుత్వంపై దండయాత్ర మాదిరి కుప్పంకు చంద్రబాబు బయల్దేరారని మండిపడ్డారు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారన్నారు. కందుకూరు, గుంటూరుల్లో అమాయకులు బలికావడానికి చంద్రబాబే కారణమని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement