Saturday, April 20, 2024

ప్రజాస్వామ్యంపై జీఓ నెం.1 గొడ్డలివేటు.. అచ్చెన్నాయుడు

ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాల పై జీఓ నెంబర్ 1గొడ్డలివేటు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జీఓ నెంబర్ 1పై నిరసన తెలుపుతూ, నినాదాలు చేస్తూ అసెంబ్లీ సమావేశాలకు ర్యాలీ గా వెళ్లారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు తో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈసందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… నాలుగేళ్లుగా సీఎం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్ సభలకు వస్తున్న జనాన్ని చూసి జీవో 1 తీసుకొచ్చారన్నారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ పాదయాత్ర సమయంలో చంద్రబాబు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి పంపించారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement