Saturday, April 20, 2024

రూ.5వేల కోట్లతో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం: జీఎంఆర్

విశాఖ‌ప‌ట్నం – భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి జిఎంఆర్ గ్రూప్ రూ 5వేల కోట్ల రూపాయిలు పెట్టుబ‌డి పెట్ట‌నుంది.. ఈ విష‌యాన్ని విశాఖ‌లో జ‌రుగుతున్న గ్లోబ‌ల్ ఇన్వెస్ట్మెంట్ స‌మితిలో జిఎంఆర్ గ్రూప్ ఛైర్మ‌న్ మ‌ల్లిఖార్జున‌రావు ప్ర‌క‌టించారు.
“నా స్వరాష్ట్రం ఏపీ విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడాన్ని మేము గొప్పగా భావిస్తున్నాము. ఈ విమానాశ్రయం మొదటి దశ లో ఆరు మిలియన్ల ప్రయాణికులకు మరియు అంతిమ సామర్థ్యం 30 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. మొదటి దశలో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం” అని జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జీఎం రావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement