Thursday, March 28, 2024

జగన్​ కోసం ప్రాణాలైనా ఇస్తా.. వంశీతో మాత్రం కలిసి పనిచేలేను: శివ భ‌ర‌త్‌రెడ్డి

ఎమ్మెల్యే వంశీపై వైసీపీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ గోసుల శివ భరత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడేపల్లిలో సమావేశం జర‌గనున్న నేపధ్యంలో వల్లభనేని వంశీతో కలిసి ప్రయాణం చెయ్యటం ఇక‌ జరగని పని అంటూ ఆయ‌న కీలక వ్యాఖలు చేశారు. టి.డి.పి అధికారంలో ఉన్నపుడు ఇదే వంశీ నోటికి వచ్చినట్లు జగన్ మోహన్ రెడ్డినీ, విజయమ్మనీ దుర్భాషలాడింది నిజం కదా? అని ప్ర‌శ్నించారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో గన్నవరం నియోజకవర్గంలో తిరిగినప్పుడు వారు నడిచిన రహదారులు మొత్తం పసుపు నీళ్లు పోసి హేళన చేసిన వ్యక్తి వంశీ అని మండిప‌డ్డారు.

మీతో పాటు కలసి ప్రయాణం చేస్తే కార్యకర్తలే మా మొహల మీద ఊమ్ము వేస్తారని, జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి మాకు 50సంవత్సరాల అనుబంధం ఉందన్నారు శివ భరత్​రెడ్డి. తమ మీద లేని పోని మాటలు చెప్పినా జగన్ మోహన్ రెడ్డినీ, తమను విడదీయలేరని, జగన్ కోసం తల తీసి ఇవ్వమన్న ఇస్తానన్నారు. ఇక.. 2024లో గన్నవరం నియోజక వర్గం టికెట్ ఇచ్చి పోటీ చెయ్యమంటే దుట్టా కుటుంబం నుండి పోటీ చేస్తామని శివ భరత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement