Thursday, March 28, 2024

ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు.. 18 మందితో పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ బుధవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. 18 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. 34 మందితో కో ఆర్డినేషన్‌ కమిటీని నియమించింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్, రాకేశ్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ హర్షకుమార్‌, కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి పల్లం రాజు, మీడియా, సామాజిక మాధ్యమాల కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డికి బాధ్యతలు అప్పగించింది. పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement