Wednesday, April 24, 2024

Breaking: గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం, ఇద్దరు దుర్మరణం.. న‌లుగురికి తీవ్ర గాయాలు

తుగ్గలి, (ప్రభ న్యూస్) : కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది.. గ్యాస్​ సిలిండర్​ పేలి ఇల్లు ధ్వంసమైన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామాంలో ఇవ్వాల (మంగళవారం) రాత్రి జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో బోయ మద్దమ్మ(65) , బోయ నాగశేషు (60) చనిపోయారు. అలాగే స్ఫూర్తి , రొగొడు, పెద్దక్క నజేబునకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై జొన్నగిరి ఎస్ ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement