Thursday, April 25, 2024

బాలిక‌పై గ్యాంగ్ రేప్‌.. క‌రెంట్ పోవ‌డంతో దారుణానికి పాల్ప‌డ్డ యువ‌కులు

నెల్లూరు జిల్లా కొండాపురంలో ఘోరం జ‌రిగింది. ఓ బాలిక‌పై న‌లుగురు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్ప‌డ్డ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చినా మానవ మృగాలు కొంతైనా భ‌య‌ప‌డ‌డం లేదు. కొన్ని ఘటనల్లో ఉరిశిక్షలు పడినా భయమనే మాటకే అర్థం లేకుండాపోతోంది. చేతిలో దిశ యాప్‌ ఉన్నా.. నిర్భయలాంటి క‌ఠిన చట్టాలున్నా కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఘోరం జరుగింది.

మైనర్ బాలికపై నలురుగు మృగాళ్లు ఘాతుకానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ అకృత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా కొండాపురంలోని అరుంధతివాడలో ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. స్థానికంగా ఎలాంటి దుకాణాలు లేకపోవడంతో చిన్నవస్తువు కావాలాన్నా పక్కనే ఉన్న రామానుజపురంకు వెళ్లాల్సిందే. అదే ఆ మైనర్ బాలికపట్ల పాలిట శాపంగా మారింది.

గురువాతం రాత్రి భోజన సమయానికి ఇంట్లో పెరుగు లేకపోవడంతో తల్లిదండ్రులు పెరుగు ప్యాకెట్ తీసుకురావాలని బాలికను రామానుజపురానికి పంపించారు. బాలిక షాపుకెళ్లి పెరుగుప్యాకెట్ తీసుకొని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఉండగా గ్రామంలో కరెంట్ పోయింది. అప్పటికే బాలికపై కన్నేసిన నలుగురు యువకులు.. ఆమెను ఊరిచివర ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లారు. బాలిక కేకలు వేయకుండా నోటిలో గుడ్డలు కుక్కేశారు. కాళ్లు చేతులు కట్టేసి బాలికను వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇంతలో బాలిక మూలుగులు విన్న స్థానికులు చెరువుకట్టవైపున‌కు వెళ్లగా ఆ యువకులు పారిపోయేందుకు యత్నించారు. వీరిలో ఒకరిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

బాలిక ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ మరో ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement