Tuesday, April 23, 2024

గుడివాడ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించిన గ‌డ్డం గ్యాంగ్ : నారా లోకేష్

మహానుభావుల పురిటిగడ్డ గుడివాడని భ్ర‌ష్టు పట్టించింది గడ్డం గ్యాంగ్ అన్నారు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. ఆయ‌న మాట్లాడుతూ… మింగడానికి ఏమి మిగలక ఆఖరికి జనాల ఒంటిపై ఉన్న గుడ్డలు సైతం లాగేసేందుకు ఏకంగా క్యాసినో ఏర్పాటు చేసారన్నారు. కే కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిన విషయం ప్రపంచం మొత్తం తెలిసినా వైసీపీ రంగులతో కళ్ళు మూసుకుపోయిన పోలీసులకు కనిపించలేదన్నారు. క్యాసినో నడిపి ప్రజల నుండి వందల కోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్ ని వదిలేసి నిజ నిర్దారణకు వెళ్లిన టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గుడివాడని గోవాడగా మార్చేసిన అసలైన సూత్రధారులపై చర్యలు తీసుకొని అరెస్ట్ చెయ్యాలన్నారు. విచ్చలవిడిగా క్యాసినో నడిపినప్పుడు అడ్డురాని కోవిడ్.. నిబంధనల పేరు చెప్పి టీడీపీ నేతల్ని అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమ‌ని నారా లోకేష్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement