Monday, March 25, 2024

Big Story | ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌, మారనున్న పన్ను శ్లాబులు.. 10 కీలక మార్పులు ఇవే!

అమరావతి, ఆంధ్రప్రభ: కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేస్తుంది. అయితే ఈసారి ఎప్పటిలా కాకుండా.. కొత్త మార్పులు ఎన్నో రానున్నాయి. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇటీ-వల ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఇవన్నీ ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వస్తాయి. అందులో ఆదాయపు పన్ను పరిమితి పెంపు నుంచి ఇంకెందరికో ఊరట నిచ్చే నిర్ణయాలు.. మరికొందరికి నిరాశ కలిగించే నిర్ణయాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకురావడం చూస్తూనే ఉంటాం. అయితే ఇందులో గ్యాస్‌ సిలిండర్ల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సహా ఇంకెన్నో నిర్ణయాలు ఉంటు-ంటాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆర్థిక సంవత్సరం మారబోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఈఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కాబోతుంది. అదే విధంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎన్నో కొత్త నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. ఇందులో ఎక్కువగా ఇటీ-వల కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలు ఉండనున్నాయి.

మొదట ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు అనుసంధానం చేసుకునే తేదీని కూడా ఈనెలాఖరు వరకే ఉండగా.. దానిని పొడగించి కాస్త ఊరట కల్పించింది. ఇక కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను పరిమితి పెంపు, సీనియర్‌ సిటిజెన్లకు డిపాజిట్లపై పరిమితి పెంపు సహా ఎన్నో ఊరటనిచ్చే నిర్ణయాలు ఏప్రిల్‌ 1 నుంచే అమలవుతాయి. మ్యూచువల్‌ ఫండ్లపై ఎల్‌టీసీజీ ప్రయోజనాలు తొలగింపు, ఎక్కువ ప్రీమియం ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీపై టాక్స్‌ వంటివి కూడా అదే రోజున అమల్లోకి వస్తాయి.

- Advertisement -

కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌..
వార్షిక బడ్జెట్‌ – 2023లో ఎక్కువగా వినిపించిన అంశం కొత్త ఆర్థిక పన్ను విధానం. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి బడ్జెట్‌లోకేంద్ర ప్రభుత్వం ఈసారి కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇక నుంచి రిటర్న్స్‌ దాఖలు చేసే సమయంలో కొత్త ఆదాయపు పన్ను విధానం డిఫాల్ట్‌ ఆప్షన్గా ఉంటు-ంది. టాక్స్‌ పేయర్లు ఇక వారికి ఇష్టమొచ్చిన పన్ను విధానం ఎంచుకునే వెసులుబాటు- కూడా కల్పించింది.

పన్ను రిబేట్‌ పెంపు..
గతంలో పన్ను విధానంలో రూ. 5 లక్షల వరకు మాత్రమే పన్ను ఆదాయంపై రిబేట్‌ ఇచ్చేవారు. ఇక ఈసారి బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరిధిని ప్రభుత్వం రూ. 7 లక్షల వరకు పెంచింది. దీంతో రూ. 7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త పన్ను విధానంలో మాత్రం మినహాయింపులు వర్తించవు కాబట్టి.. పన్ను చెల్లింపుదారుడు ఎంత మొత్తంలో ఇన్వెస్ట్‌ చేశారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు.

పన్ను శ్లాబుల్లో మార్పులు.. కొత్తవి ఇవే..
ఈ బడ్జెట్‌లోనే పన్ను శ్లాబుల్లో కూడా మార్పులు చేశారు. గతంలో 6 శ్లాబులు ఉండగా.. ఈసారి దానిని ఐదుకు కుదించారు. దీంతో ఇకపై ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా 5 శ్లాబులు మాత్రమే ఉంటాయి. అవేంటంటే.. రూ. 0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించరు. రూ. 3-6 లక్షల వరకు ఉంటే 5 శాతం, రూ.6 నుంచి 9 లక్షలు ఉంటే 10 శాతం, రూ.9-12 లక్షల ఆదాయం ఉంటే 15 శాతం, రూ.12-15 లక్షల ఆదాయం ఉన్నవారికి 20 శాతం, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే.. 30 శాతం పన్ను కట్టాలి. ఇక పాత పన్ను విధానంలో మార్పులేం లేవు.

సీనియర్‌ సిటిజెన్స్‌కు ఉపశమనం..
బడ్జెడ్‌లో తీసుకున్న మరో కీలక నిర్ణయం సీనియర్‌ సిటిజెన్లను ఉద్దేశించింది. సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్‌ స్కీమ్‌లో ఒక్కో వ్యక్తి రూ.15 లక్షల వరకు గరిష్టంగా డిపాజిట్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దానిని రూ. 30 లక్షలకు పెంచారు. ఇక మంత్లీ ఇన్‌కం స్కీమ్‌ (ఎంఐఎస్‌) పరిమితి కూడా పెంచింది కేంద్రం. ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

బీమా పాలసీలపైనా పన్ను..
గతంలో జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ- మొత్తంపై ఎలాంటి పన్ను ఉండేది కాదు. ఈ విషయం తెలిసిందే. అయితే 2023, ఏప్రిల్‌ 1 తర్వాత కొనుగోలు చేసిన బీమా పాలసీ ప్రీమియం మొత్తం రూ. 5 లక్షలు దాటితే అప్పుడు ఆ మొత్తంపై పన్ను విధిస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాలసీల మొత్తం రూ. 5 లక్షలు దాటినా కూడా పన్ను వర్తిస్తుంది.

ఆ మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్లకు ఝలక్‌..
ఇదే సమయంలో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లపై ఇస్తున్న దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనం కూడా కేంద్రం ఎత్తివేసింది. ఇక వీటిల్లో మదుపుపై వచ్చే రాబడిపై పన్ను శ్లాబుల ప్రకారం.. టాక్స్‌ చెల్లించాలి. ఆర్థిక బిల్లు 2023 సవరణల్లో కేంద్రం దీనిని ప్రతిపాదించింది. ప్రస్తుతానికి డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఇన్వెస్ట్‌ చేస్తే వాటిని దీర్ఘకాల పెట్టు-బడిగా పరిగణిస్తున్నారు. ఇండెక్సేషన్‌తో కలిపి 20 శాతం ఎల్‌టీసీజీ పన్ను వేస్తున్నారు.

పెరిగేవి.. తగ్గేవి ఇవే..
ఇక ఏప్రిల్‌ 1 నుంచి కొన్ని వస్తువుల ధరల్లోనూ మార్పులు రానున్నాయి. పన్ను రేట్లు-, సుంకాల్లో ఈ మేరకు కేంద్రం మార్పులు చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మార్పులు ఉన్నాయి. దీంతో ప్రైవేట్‌ జెట్స్‌, హెలికాప్టర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గోల్డ్‌ జువెలరీ, వెండి వస్తువులు, సెగరెట్లు- వంటి ధరలు పెరుగుతాయి. వజ్రాలు, బొమ్మలు, దుస్తులు, సైకిల్స్‌, టీ-వీ, ఫోన్స్‌, కెమెరా లెన్సె వంటి ధరలు తగ్గుతాయి.

మహిళల కోసం స్పెషల్‌ స్కీం..
ఇక మహిళలు, ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించింది. ఇది 2023 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు రెండేళ్లు అందుబాటు-లో ఉంటు-ంది. దీనికి 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక ఇందులో డిపాజిట్‌ గరిష్ట పరిమితి రూ. 2 లక్షల వరకు ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టోల్‌ బాదుడు..
ఇక జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ఫీజుల బాదుడు షురూ కానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంలోనే టోల్‌ రుసుములను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి అందుకు సిద్ధంగా ఉండాల్సిందే మరి.

హాల్‌ మార్కింగ్‌..
ఇక ఇదే సమయంలో పసిడి ఆభరణాలు, కళాఖండాలకు ఆరంకెల హెచ్‌యుఐడీ (హాల్మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌) తప్పనిసరి. అంటే ఈ హెచ్‌యుఐడీ ఉంటేనే ఆ గోల్డ్‌ జువెలరీ విక్రయించేందుకు అవకాశం ఉంటు-ంది. లేని వాటిపై నిషేధిస్తున్నట్లు- కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. గడువు పొడగించేది కూడా లేదని స్పష్టం చేసింది.

పెరగనున్న వాహన ధరలు..
ఏప్రిల్‌ 1 నుంచి వాహనాల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే పలు తయారీ కంపెనీలు ధరల్ని పెంచుతున్నట్లు- ప్రకటించాయి కూడా. ముఖ్యంగా కార్లు ప్రియం కానున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి కఠిన వాహన ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మారుతీ, హోండా, హీరో మోటోకార్ప్‌ సహా పలు కంపెనీలు ధరలు పెంచుతున్న జాబితాలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement