Thursday, April 25, 2024

ఉద్యోగులకు లక్ష్మీనారాయణ మద్దతు: సీఎం జగన్ కు సీబీఐ మాజీ జేడీ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీఆర్సీ, డీఏ బకాయిలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉద్యోగులు పాలనలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలు, ప్రయోజనాలకు విరుద్ధమైన PRC ఫిట్‌మెంట్, DA, HRA స్లాబ్‌ల జిఓలను AP ప్రభుత్వం సవరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపి పరిష్కారానికి రావాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలను ట్యాగ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement