Thursday, April 25, 2024

Flash.. Flash: రోడ్డు ప్రమాదంలో సూళ్లూరుపేట ఎంపీడీవో నర్మద మృతి..

నెల్లూరు జిల్లా ఆదిశంక‌ర కాలేజీ స‌మీపంలో జాతీయ ర‌హ‌దారిపై యాక్సిడెంట్ జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో సూళ్లూరుపేట ఎంపీడీవో న‌ర్మ‌ద చ‌నిపోయారు. ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అదే కారులో న‌ర్మద ఉన్నారు.

గూడూర్ రూరల్ లోని ఆదిశంకర కాలేజ్ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని ఢీకొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న సూళ్లురుపేట ఎంపీడీవో నర్మద చ‌నిపోయారు. కారులో ఎంపీడీవో భర్త, కొడుకు ఉన్నట్టు సమాచారం. వీరు నెల్లూరు నుండి సూళ్లూరుపేట వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. ఘటన స్థలానికి చేరుకున్న గూడూరు రూరల్ ఎస్సై బ్రహ్మనాయుడు, పోలీసు సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement