Tuesday, March 26, 2024

Flash Flash‌ … రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి మృతిచెందిన ఘ‌ట‌న‌ ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహ‌నాన్ని కారు ఢీకొట్ట‌డంతో బైక్ పై ప్రయాణిస్తున్ననల్లబోతుల బాల వెంకటేశ్వర్లు (24) సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఇతనిది రాచర్ల మండలం ఆకవీడు గ్రామం. మార్కాపురంలో బైక్ లైసెన్సుకు అప్లై చేసుకొని తిరుగు ప్రయాణంలో స్వగ్రామం ఆకవీడు వస్తుండగా బెస్తవారిపేట నుండి శ్రీశైలంకు వెళ్తున్న కారు ఢీ కొట్టిన సంఘటనలో నల్లబోతుల వెంకటేశ్వర్లు (24) సంఘటన స్థలంలోనే మృతి చెందాడు…కేసు నమోదు చేసుకున్న కంభం పోలీస్ లు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement