Tuesday, March 26, 2024

వెలుగోడులో మ‌త్స్య‌కారుల గ‌ల్లంతు.. 50 మందితో గాలింపు చ‌ర్య‌లు

కర్నూలు జిల్లా వెలుగోడులో ఇద్ద‌రు దంప‌తులు గ‌ల్లంతైన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.. నిన్న మధ్యాహ్నం చేపలవేటకు వెళ్లిన భార్యా, భ‌ర్త‌లిద్ద‌రూ క‌నిపించ‌క‌పోయారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (VBR)లో పుట్టి మునిగి ఇద్దరు మత్స్యకారులు అంకన్న(28), జయలక్ష్మి(24) గల్లంతైన‌ట్టు ఇవ్వాల (సోమ‌వారం) అధికారులు తెలిపారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. వీరికి ఇద్దరు చిన్నపిల్లలున్నారు. ఉద‌యం నుంచి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టినా ఎలాంటి ఆచూకీ దొర‌క‌లేద‌ని తెలుస్తోంది. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో గల్లంతైన వారి కోసం. 50 మంది మత్స్యశాఖ సిబ్బందితో ప్రత్యేకంగా గాలిస్తున్నట్లు మత్స్య శాఖ సంయుక్త సంచాలకురాలు శ్యామల ఆంధ్రప్ర‌భకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement