Tuesday, March 26, 2024

Breaking: పులివెందులలో కాల్పుల కలకలం.. ఒక‌రు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దిలీప్, మస్తాన్ అనే ఇద్దరు వ్యక్తులపై భరత్ యాదవ్ కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ దిలీప్, మస్తాన్ లు పులివెందుల ఆస్పత్రిలో చికిత్స కోసం తరలిస్తుండగా.. దిలీప్ మృతిచెందాడు. మస్తాన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో కాల్పులు జరిపినట్లు సమాచారం. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్ యాదవ్ మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులు జరిపిన భరత్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement