Friday, April 26, 2024

గుడివాడ క్యాసినో లో రూ.500 కోట్ల ఆర్థిక లావాదేవీలు : వర్ల రామయ్య

గుడివాడ క్యాసినో లో రూ.500 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు టీడీపీ నేత‌ వర్ల రామయ్య ఆరోపించారు. గుడివాడ క్యాసినో నిర్వహణకు సంబంధించి ఐటీ అధికారులతో టీడీపీ నేతల సమావేశం ముగిసింది. క్యాసినో నిర్వహణపై చికోటి ప్రవీణ్ ప్రచారం చేసిన ఆధారాలు, గోవా నుంచి వచ్చిన మహిళల విమాన టికెట్ల వివరాలు ఐటీకి ఇచ్చినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. చికోటి ప్రవీణ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ అంతా ఒకటేనని.. 200 కోట్లనుంచి రూ.500 కోట్ల వరకు మనీ లాండరింగ్ జరిగిందని ఈడీకి తెలిపామని వర్ల రామయ్య అన్నారు. దీనిపై ఈడీ చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement