Thursday, March 28, 2024

ప్రమాద బాధిత చిన్నారికి రూ.10 వేలు ఆర్థిక సాయం

శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం బారిజిపాడుకు చెందిన 6 ఏళ్ల బాలికలకు ఆర్థిక సాయం అందింది. బాలిక ప్రసీత ఇటీవల ప్రమాదవశాత్తు కాలిపోయింది. చలి కాలం కావడంతో కట్టెల పొయ్యి దగ్గర ఉండటంతో గౌనుకు నిప్పు అంటుకొని ప్రమాదం జరిగింది. అయితే, చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో స్పందించిన బెల్లుపడ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రస్ట్ సభ్యుల తరపున శ్రీకాకుళం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిన్నారికి రూ.10 వేలు ఆర్ధిక సహాయం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement