Thursday, April 25, 2024

కర్నూలులో ఉద్రిక్తత.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. అరికేర గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మొన్న జరిగిన దేవరగట్టు కర్రలసమరంలో తమ వర్గం వారిపై దాడి చేశారని నెపంతో సోమవారం ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: మాడ్వి హిడ్మా తెలంగాణలోకి ప్రవేశం?

Advertisement

తాజా వార్తలు

Advertisement