Wednesday, March 27, 2024

పిడుగుపాటుకు తండ్రీ కొడుకు దుర్మరణం.. కర్నూలు జిల్లాలో ఘటన

కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. హోళగుంద మండలంలో పిడుగుపడి తండ్రి, కొడుకు చనిపోయారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన సిద్ధిక్ సాబ్ (71) హుసేన్ సాబ్ (43) ఇంటి ఆవరణంలో నిద్రిస్తున్నారు. ఇదే సమయంలో భారీ వర్షం కురవడంతో పాటు పిడుగు పడింది. దీంతో తండ్రి, కుమారుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో విషాదం నెలకొంది. కాగా మండలంలో గత రాత్రి 12.4 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement