Thursday, March 28, 2024

Breaking: ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

ఓ ఘోర రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ముద్దనూరు బైపాస్ లో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement