Friday, April 19, 2024

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో ఐదుగురు చ‌నిపోయారు. ఈ దుర్ఘటన కంభం సమీపంలో జరిగింది. సోమవారం తెల్లవారుజామున.. లారీని ఓ కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. పల్నాడు జిల్లాలోని మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామస్థులుగా గుర్తించారు. మృతుల్లో అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55), ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24) ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement