Wednesday, April 24, 2024

ఏపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు స‌జీవ‌ద‌హ‌నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. ఇసుక లోడ్ తో వెళ్తున్న లారీ డివైడర్ ను దాటి అవతల ఉన్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో క్యాబిన్ నుంచి మంటలు భారీగా చెలరేగడంతో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవ దహనమయ్యారు. ఎర్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement