Tuesday, April 23, 2024

అప్పులతో రైతు ఆత్మహత్య.. క‌ర్నూలు జిల్లాలో ఘ‌ట‌న‌

వెలుగోడు, (ప్రభ న్యూస్) : క‌ర్రూలు జిల్లాలో ఘోరం జ‌రిగింది. అప్పుల బాధ త‌ట్టుకోలేక ఓ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న జ‌రిగింది. వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి చెందిన సామెల్ (42) అప్పుల బాధతో శుక్రవారం పురుగుల‌మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సామెల్ వ్య‌వ‌సాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. త‌న‌కున్న 7 ఎకరాల్లో పంటసాగు చేయగా దిగుబడి లేక, పొలంలో పెట్టిన పెట్టుబడులు రాక పెద్ద మొత్తంలో న‌ష్ట‌పోయాడు. 16 లక్షల రూపాయల అప్పులు కావడంతో అదే గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య ఎలిసెమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై జగన్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఒక కుమార్తె, ఒక కొడుకు ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement