Wednesday, March 27, 2024

నంద్యాలలో విషాదం.. కుటుంబం ఆత్మహత్య

కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం జరిగింది. నంద్యాలలోని మల్దార్‌ పేటలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలతోపాటు దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులు చంద్రశేఖర్, కళావతి, అంజలి, అఖిలగా గుర్తించారు. విగత జీవులుగా మారిన చంద్రశేఖర్, కళావతి, పిల్లలను చూసి బంధువులు బోరున విలపించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన గ్రామం విషాదంలో మునిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement