Saturday, April 20, 2024

Family suicide: విజయవాడలో విషాదం.. తెలంగాణకు చెందిన కుటుంబం ఆత్మహత్య

విజయవాడ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడలోని కన్యకాపరమేశ్వరి సత్రంలో విషం తాగి తల్లి, కొడుకు మృతి చెందగా… మరో కుమారుడితో కలిసి తండ్రి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులు శ్రీలత(54), ఆశిష్‌(22) సురేష్(56), అఖిల్‌(28)గా పోలీసులు గుర్తించారు.

ఈనెల 6న నిజామాబాద్‌ నుంచి పప్పుల సురేష్‌ కుటుంబం ఈ నెల దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వచ్చారు.  కన్యకా పరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్‌ పేరుతో రూమ్‌ తీసుకున్నారు. అప్పుల బాధతో చనిపోతున్నట్లు నిర్ణయించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement