Thursday, April 25, 2024

AP: 10 పురపాలికల్లో ప్రత్యేకాధికారుల గడువు పొడిగింపు.. ఉత్త‌ర్వులిచ్చిన ప్ర‌భుత్వం

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని 10 పురపాలికల్లో ప్రత్యేకాధికారుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం సహా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకాధికారి గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలకు చెందిన స్పెషల్ ఆఫీసర్ల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 మే 5వ తేదీ లేదా ఎన్నికలు జరిగే వరకూ ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాజమహేంద్రవరం కార్పోరేషన్ సహా రాజాం, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, గుడివాడ, బాపట్ల, గూడూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలకు సంబంధించి ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement