Thursday, April 18, 2024

AP: ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా అమ‌ర్ ప‌ద‌వీ కాలం పొడింగిపు.. ఉత్తర్వులు జారీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో స‌ల‌హాదారుడి ప‌ద‌వీ కాలాన్ని పొడిగిస్తూ ఇవ్వాల (శ‌నివారం) ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఉన్న దేవులపల్లి అమర్ పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఏపీ సాధార‌ణ ప‌రిపాల‌నా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రేవు ముత్యాల రాజు శ‌నివారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ప‌లువురిని రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారులుగా నియ‌మించారు. సాక్షి టీవీలో కీల‌క స్థానంలో ప‌ని చేస్తున్న తెలంగాణ‌కు చెందిన దేవులప‌ల్లి అమ‌ర్‌ను రాష్ట్ర ప్రభుత్వ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా నియ‌మించారు. తాజాగా ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగియ‌నుండ‌టంతో మ‌రో ఏడాది పాటు ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement