Thursday, April 25, 2024

వైసీపీ నేత మళ్లను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 2019లో మళ్ల విజయప్రసాద్‌పై ఒడిశాలో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా సీఐడీ, నేరవిభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మళ్ల విజయప్రసాద్‌ను విశాఖ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ అనుమతితో విజయప్రసాద్‌ను ఒడిశా తీసుకెళ్లారు.

కాగా, ప్రస్తుతం రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ముళ్ల విజయప్రసాద్‌ ఉన్నారు.  ‘వెల్ఫేర్‌’ సంస్థ పేరుతో మళ్ల రియల్‌ ఎస్టేట్‌, చిట్‌ఫండ్‌ వ్యాపారం చేస్తున్నా రు. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఒడిసాలోనూ చిట్‌ఫండ్‌ వ్యాపారం చేశారు. అక్కడ డిపాజిట్‌దారులకు సక్రమంగా చెల్లింపులు జరపకపోవడంతో ఫిర్యాదులందాయి. దీనిపై ఒడిసా సీఐడీ పోలీసులు రెండేళ్ల కిందట కేసు నమోదుచేశారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు సోమవారం విశాఖకు వచ్చారు. మళ్ల విజయ్‌ ప్రసాద్‌ను స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఒడిశా సీఐడీ పోలీసులు ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement