Saturday, April 20, 2024

రఘురామ మొబైల్ నుంచి మాజీ ఐఏఎస్ కు మెసేజ్‌లు.. పంపింది ఎవరు?

నరసాపురం ఎంపీ ఘురామ‌కృష్ణ‌రాజు మొబైల్ నంబర్ నుంచి తమకు మెసేజ్‌లు వస్తున్నాయని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ ర‌మేశ్ తెలిపారు. త‌న‌తో పాటు తన కుటుంబ స‌భ్యుల‌కు మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌ని పీవీ ర‌మేశ్ ట్వీట్ చేశారు. దీనిపై ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ట్విట్టర్ ఖాతాలోనే స్పందించారు. తన మొబైల్ ఏపీ సీఐడీ పోలీసుల వద్ద ఉందని తెలిపారు. ఏపీ సీఐడీ పోలీసులు మే 14న తనను అరెస్టు చేసిన రోజున తన మొబైల్ ఫోనును అన‌ధికారికంగా స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఇప్ప‌టికీ అది వారి వద్దే ఉందని, దాన్ని తిరిగి ఇచ్చేయాలని లీగ‌ల్ నోటీసులు పంపానని వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం అందులోని సిమ్ కార్డును బ్లాక్ చేయించానని, కొత్త సిమ్ కార్డు తీసుకున్నానని ర‌ఘురామ వివ‌రించారు. మే 14 నుంచి జూన్ 1 వ‌ర‌కు తాను ఎవ్వ‌రికీ, ఎటువంటి మెసేజ్‌లూ పంప‌లేదన్నారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా తన మొబైల్‌ను దుర్వినియోగం చేస్తే కనుక, సునీల్ కుమార్‌తో పాటు ఇత‌రుల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకునేలా చేస్తాన‌ని హామీ ఇస్తున్నానని ర‌ఘురామ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement